VIDEO: మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ
KKD: మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదివారం పెద్దాపురంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు విజయ శంకర్, కృష్ణ భగవాన్, ఎస్సై మౌనిక పాల్గొన్నారు. యువత గంజాయి, గుట్కా వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని డీఎస్పీ పిలుపునిచ్చారు.