రెండు రోజుల కస్టడీకి వంశీ

AP: హనుమాన్ జంక్షన్ పోలీసుల కస్టడీకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరలించనున్నారు. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఆయనను కస్టడీకి తీసుకోనున్నారు. వంశీని రెండు రోజులపాటు కస్టడీకి ఇస్తూ నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు వంశీని పోలీసులు ప్రశ్నించనున్నారు.