నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
ELR: జిల్లాలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ఆయా కార్యాలయాల్లో అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేని వారు meekosam.ap.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆమె సూచించారు.