అమీన్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఛైర్‌పర్సన్

అమీన్ పీర్ దర్గాలో మొక్కులు తీర్చుకున్న ఛైర్‌పర్సన్

ATP: కడపలోని పవిత్ర అమీన్ పీర్ దర్గాను అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి సందర్శించారు. మంగళవారం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో తాను కోరుకున్న మొక్కుబడి నెరవేరిన సందర్భంగా సంప్రదాయం ప్రకారం భక్తులకు చక్కెర పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కడప దర్గా విశిష్టతను కొనియాడారు.