ఎర్ర జెండా ఐక్యతను చాటాలి: సీపీఐ
BDK: ఆళ్లపల్లి మండలం అడవి రామవరం గ్రామపంచాయతీలో సీపీఐ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడతలో జిల్లా వ్యాప్తంగా సత్తా చాటినట్లు అదేవిధంగా మూడో విడతలో కూడా సీపీఐ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఎర్రజెండా ఐక్యతను చాటాలన్నారు.