జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు
ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 33 FIRలు నమోదు చేసినట్లు SP కాంతిలాల్ పాటిల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇందులో 6 కేసులను చేధించి 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కాగా, ఈ ఏడాది రూ.1.96 కోట్లు సైబర్ మోసగాళ్లు కాజేశారని, వాటిలో రూ. 14.77 లక్షలను నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేశామని వెల్లడించారు.