'బీజేపీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలి'
నెల్లూరు జిల్లా కోవూరులో మండలస్థాయి నాయకులు, కార్యకర్తలకు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం, సిద్ధాంతలపై అవగాహన, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై వారికి దిశానిర్దేశం చేశారు.