తేనెటీగల పెంపకం ద్వారా అదనపు ఆదాయం
ASR: తేనెటీగల పెంపకం ద్వారా రైతులు అధిక అదనపు ఆదాయం పొందవచ్చని DRDA పీడీ వీ.మురళి, జిల్లా ఉద్యానశాఖ అధికారి కే.బాలకర్ణ, అరకు హెచ్వో కే.శిరీష అన్నారు. గురువారం ఉద్యానశాఖ, డీఆర్ డీఏ ఆధ్వర్యంలో అరకు వెలుగు కార్యాలయంలో తేనెటీగల పెంపకంపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. తేనెటీగల పెంపకం, తేనె తయారు కావడం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.