పట్టణంలోని రెండు దుకాణాల్లో చోరీ

మేడ్చల్ పట్టణ మార్కెట్లోని 2 దుకాణాల్లో బుధవారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. గుర్తుతెలియని దొంగలు మనీష్ ట్రేడర్స్, అగర్వాల్ ట్రేడర్స్ దుకాణాల్లో షట్టర్లను పైకి లేపిలోనికి ప్రవేశించి క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును తస్కరించారు. అగర్వాల్ ట్రేడర్స్లో రూ.3.50 లక్షలు, మనీస్టేడర్లో రూ.35వేలు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.