ఆహార కల్తీపై శాంపిల్స్.. 68 మందికి నోటీసులు..!
కడప జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అధికారులు 528 ఆహార శాంపిల్స్ సేకరించారు. 50 శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో 68 మందికి నోటీసులిచ్చారు. ఆహార కల్తీపై 4 క్రిమినల్, 12 పెట్టీ కేసులు నమోదు చేస్తున్నామని జిల్లా ఆహార భద్రతా నియంత్రణ శాఖ అధికారులు రామచంద్ర, హరిత తెలిపారు. దుకాణాల లైసెన్స్, రెన్యువల్, పెనాల్టీల ద్వారా రూ.39,29,900ల ఆదాయం వచ్చిందన్నారు.