IPS సునీల్ నాయక్కు కోర్టు కీలక ఆదేశాలు
AP: Dy. స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న IPS సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు సునీల్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని, దర్యాప్తుకు పూర్తిస్థాయిలో సహకరించాలని పేర్కొంది. తదుపరి విచారణ APR 6కు వాయిదా వేసింది.