తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
AP: తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుండగా.. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల వేంకటేశ్వరుడిని 73,852 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.16 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.