సైబరాబాద్ కమిషనరేట్లో 32 మంది ఎస్సైల బదిలీలు
MDCL: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒకేసారి 32 మంది ఎస్సైలను హైదరాబాద్ జోన్కు మారుస్తూ సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్న 32 మంది ఎస్సైలను సైబరాబాద్కు బదిలీ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ చార్మినార్ జోన్ డీఐజీకి సీపీ లేఖ రాశారు. కూకట్పల్లి జోన్లో 10, కుత్బుల్లాపూర్లో 12 మందిని సరెండర్ చేశారు.