జాతీయ కరాటే పోటీల్లో శంకర్‌పల్లి విద్యార్థుల జోరు

జాతీయ కరాటే పోటీల్లో శంకర్‌పల్లి విద్యార్థుల జోరు

RR: కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఆదివారం జరిగిన మూడవ జాతీయ కరాటే పోటీల్లో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన ఎల్‌బీకే బుడోకాన్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం 20 మంది విద్యార్థులు పోటీపడగా.. 8 బంగారు, 7 వెండి, 5 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. విద్యార్థుల ప్రతిభను మాస్టర్ రవీందర్ యాదవ్ అభినందించారు.