పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
కృష్ణా: పెడన మండలం రామాపురం గ్రామంలో రహస్యంగా పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు పేకాట శిబిరంపై నిన్న దాడి చేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోనికి తీసుకొని వారి వద్ద నుండి ₹3,200/- నగదు స్వాధీనం తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.