అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
E.G: ద్వారకాతిరుమల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మంగళవారం దర్శించుకున్నారు. ముందుగా వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.