ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్కు ఎంపీ లేఖ

NDL: పాకిస్తాన్ కవ్వింపు చర్యల దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్లో చిక్కుకున్న ఏపి విద్యార్ధుల కోసం కూటమి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుందని నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో రెసిడెంట్ కమిషనర్గా ఉన్న లవ్ అగర్వాల్కు ఆమె లేఖ రాశారు. జమ్మూలో ఉన్న ఏపి విద్యార్థులను సేఫ్గా తీసుకురావాలని, కేంద్ర అధికారులతో సమన్వయం చేయమని అభ్యర్థించారు.