శ్రీ జగన్నాథ శోభాయాత్రకు శ్రీకారం

శ్రీ జగన్నాథ శోభాయాత్రకు శ్రీకారం

NLR: త్వరలో ఉదయగిరిలో జరగనున్న శ్రీ జగన్నాథ శోభాయాత్రను జయప్రదం చేసేందుకు ఉదయగిరి భక్తులు శ్రీకారం చుట్టారు. శనివారం ముందస్తుగా పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి చీర సారే సమర్పించారు. మండలంలోని 17 పంచాయతీల్లో హిందూ భక్తులు స్వచ్ఛందంగా సంకల్పం బూని కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.