తాడేపల్లి గూడెం రూరల్ ఎస్సైగా రవికుమార్ బాధ్యతలు
W.G: తాడేపల్లిగూడెం రూరల్ SIగా ఎస్. రవికుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన భీమవరం ఐటీ, సోషల్ మీడియా, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేశారు. బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన జేవీఎన్. ప్రసాద్ ట్రాఫిక్ SIగా బదిలీ అయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన SI ఈ సందర్భంగా పేర్కొన్నారు.