జనగణన పకడ్బందీగా నిర్వహించాలి: కమిషనర్
WGL:గ్రేటర్ వరంగల్ పరిధిలో మే నెలలో జరగనున్న జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులకు ఆదేశించారు. గురువారం రాత్రి నక్కలగుట్ట వార్డు కార్యాలయంలో ఇంటి నంబర్ల మ్యాపింగ్ పనులను తనిఖీ చేశారు. జనగణన సాఫీగా సాగేందుకు ఇంటి నంబర్లు, నివాస గృహాలు, కాలనీల మ్యాపింగ్ ప్రక్రియ సహాయపడుతుందని అన్నారు.