ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష

ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష

VKB: కుల్కచర్ల మండల కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రామలింగేశ్వర జూనియర్ కళాశాల వివేకానంద జూనియర్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. వివేకానంద కళాశాలలో 204 మంది విద్యార్థులకు గాను 197 మంది హాజరు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారు.