సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

HYD: సికింద్రాబాద్ MRO కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, సర్వేయర్ కిరణ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కిరణ్ పట్టుబడ్డాడు. సర్వేయర్ కిరణ్‌తో పాటు సిబ్బంది భాస్కర్‌ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. MRO కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.