అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి విరాళం

అమరావతి నిర్మాణానికి మంత్రి మండిపల్లి విరాళం

అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విజయవాడలో రూ.3,01,116 చెక్కును ముఖ్య మంత్రి చంద్రబాబుకు సచివాలయంలో ఇచ్చారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.