VIDEO: సింహాచలంలో వైభవంగా స్వామివారి నిత్య కల్యాణం
VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి నిత్య కల్యాణం ఇవాళ అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమశాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలు, మాంగళ్యధారణ, తలంబ్రాల కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.