3 వేల మందికి అన్నదాన కార్యక్రమం
GNTR: తెనాలి వైకుంఠపురం సమీపంలోని పోలేరమ్మ తల్లి దేవస్థానం 28వ వార్షికోత్సవ సందర్భంగా బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. గుంటి వెంకట్ ఆధ్వర్యంలో 3 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు కుద్దూస్, త్రిమూర్తి, జొన్నాదుల మహేష్, వెంకటేష్, అఖిల్, షావుల్ తదితరులు పాల్గొన్నారు.