నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
MDK: చిన్న శంకరంపేట మండలం టి. మాదాపూర్ తండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాలోత్ ప్రసాద్, తిరుమల దంపతుల కుమార్తె చిన్నారి ప్రణయ శ్రీ (18 నెలలు) గురువారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటూ, అనుకోకుండా నీటి బకెట్లో తలకిందులుగా పడిపోయి మృతి చెందింది. కుటుంబ సభ్యులు గమనించేలోపే ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది.