మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ
VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో విజయనగరం జడ్పీ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ నుండి భీమిలి ఆర్టీవో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె సిరమ్మ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.