మనువాద సంస్కృతిని ప్రతిఘటించాలి: నేతలు
వనపర్తిలోని CITU కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మహిళా దినోత్సవ సభలో CPM నేత పుట్ట ఆంజనేయులు, ఐద్వా కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. మహిళలు జీవితాంతం ఇతరులపై ఆధారపడి బతకాలనే మనువాద ధర్మాన్ని ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. లింగ సమానత్వం, సమాన హక్కుల సాధన కోసం మహిళలు పోరాడాలని వారు డిమాండ్ చేశారు.