స్మార్ట్ సిటీ పనులు త్వరగా పూర్తి చేయాలి
TPT: తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 43వ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు సహా అన్ని పనులను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ ఎన్. మౌర్య పాల్గొన్నారు.