8 లైన్లుగా HYD - విజయవాడ జాతీయ రహదారి: మంత్రి
NLG: తెలంగాణ రోడ్ల అభివృద్ధికి భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మొత్తం రూ.60,799 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.36,000 కోట్లతో రీజినల్ రింగ్ రోడ్, రూ.10,400 కోట్లతో HYD – విజయవాడ హైవేను 8 లైన్లుగా విస్తరించనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద రోడ్ల నిర్మాణ కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు.