'విద్యానిధి పథకం ద్వారా పేద విద్యార్థులకు చేయూత'
MBNR: విద్యా నిధి పథకం ద్వారా పేద విద్యార్థులకు చేయూత అందుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ పయనీర్ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని ఎమ్సెట్లో 12,362 ర్యాంకు సాధించిన విద్యార్థినికి ఆయన విద్యా నిధి పథకం నుంచి రూ.62,500 చెక్కును ఎమ్మెల్యే మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు.