'వెంటనే పంటలను కొనుగోలు చేయాలి'
SDPT: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం, పొద్దు తిరుగుడు, కందులు, మొక్కజొన్న కొనుగోళ్లను చేపట్టాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోలు గురించి రైతులతో మాట్లాడుతూ.. వెంటనే పంటల కొనుగోళ్లను ప్రారంభించాలన్నరు.