వికలాంగుడికి వీల్ చైర్ అందజేత

NRML: కడెం మండలంలోని అంబారిపేట గ్రామానికి చెందిన పుట్టు వికలాంగుడైన పెరగాని నరేష్ ఆర్థిక పరిస్థితిని చూసి అంబర్పేట్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కట్ల సింధుజ సాగర్ గురువారం ఉదయం నరేష్కు వీల్ చైర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిరుపతి, కట్ల వెంకన్న , జినక నాగరాజు, రెంకల శీను, రాజు, రాజన్న కొప్పుల భూమన్న, నారాయణ తదితరులు ఉన్నారు.