'మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి'

'మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి'

JGL: మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు 87వ జయంతి సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా పనిచేసిన నాయకుడని పేర్కొన్నారు. యువత ఆయన సేవాభావం, నైతిక విలువలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.