రావుట్లలో బ్రిడ్జి పనులకు రూ.10 లక్షలు మంజూరు
NZB: రావుట్ల గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయం దగ్గర గల బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారాని గ్రామస్తులు తెలిపారు. ఈ నిధుల మంజూరుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కి కృతజ్ఞతలు తెలిపారు.