బావి భారత సమాజం పాఠశాల నుంచి రూపొందుతుంది: MLA
కోనసీమ: భావి భారత సమాజం పాఠశాలల నుంచే రూపొందుతుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాలలో పాల్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఉపాధ్యాయులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్ధుల ప్రోగ్రెస్ను ఆయన పరిశీలించారు.