విమాన ప్రయాణికులకు షాక్..!
దేశీయ విమాన ప్రయాణ ధరలపై ఉన్న గరిష్ట పరిమితిని మార్చి 23 నుంచి తొలగిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గత డిసెంబర్లో ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ధరలు పెరగకుండా ప్రభుత్వం ఈ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం విమాన సర్వీసులు స్థిరపడటంతో, ఎయిర్లైన్స్లకు ధరలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.