PHCని తనిఖీ చేసిన ఇంఛార్జ్ డిప్యూటీ DMHO

PHCని తనిఖీ చేసిన ఇంఛార్జ్ డిప్యూటీ DMHO

కామారెడ్డి పట్టణంలోని UPHC రాజీవ్ నగర్‌లో ఇవాళ ఇంఛార్జ్ డిప్యూటీ DMHO డా.విజయ మహలక్ష్మి తనిఖీ చేశారు. UPHC ద్వారా ప్రజలకు అందుతున్న జాతీయ, రాష్ట్ర పథకాల వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించిన ఆమె సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమయానుసారం చిన్న పిల్లలకు టీకాలు అందించాలన్నారు.