మరోసారి తండ్రి అయిన తేజస్వీ యాదవ్

మరోసారి తండ్రి అయిన తేజస్వీ యాదవ్

ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ మరోసారి తండ్రి అయ్యారు. తన భార్య రెండో సంతానంగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు శిశువు ఫొటోను పంచుకుంటూ చిన్నారి రాకను ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ X వేదికగా ట్వీట్ చేశారు. తేజస్వీ యాదవ్‌కు 2021లో వివాహం జరగగా.. 2023లో తొలి సంతానం కలిగింది.