కొండేపిలో యాంటీ డ్రగ్స్ జీపు యాత్ర

కొండేపిలో యాంటీ డ్రగ్స్ జీపు యాత్ర

ప్రకాశం: కొండేపి మండలంలో డీవైఎఫ్ఐ, యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జనచైతన్య జీపు యాత్ర నిర్వహించారు. అనకర్లపూడి, పెరిదేవి గ్రామాలు, పాఠశాలలు, కాలనీల్లో పర్యటించి విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కె. రమాదేవి పిలుపునిచ్చారు.