ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో

ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన ఎంపీడీవో

MDK: పెద్ద శంకరంపేట మండలం వీరోజిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణాలను ఎంపీడీవో క్రాంతి కుమార్ పరిశీలించారు. ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇందిరమ్మ గృహాలను వెంటనే సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు విడతల వారీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.