జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన కలెక్టర్
GDWL: జిల్లాలో సామాజిక సమస్యల పరిష్కారం, సమగ్ర అభివృద్ధి కోసం బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.