అంబేద్కర్ అవార్డు గ్రహీతకు సన్మానం

అంబేద్కర్ అవార్డు గ్రహీతకు సన్మానం

PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ వాణి పత్రికా రిపోర్టర్ సుంచు మల్లేశం ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ బంజేరుపల్లి తండా ఆల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో మల్లేశంను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.