మార్చిలో ఎండలు.. జర పైలం.!
HYD: మార్చి నెలలో ఎండలు ప్రారంభమై, 38 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా HYD అధికారులు తెలిపారు. దీని ద్వారా నీటి అవసరాలు సైతం పెరుగుతాయని వివరించారు. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, వీలుంటే గొడుగు తీసుకుని వెళ్లటం మంచిదని సూచించారు. నగరంలో వడగాలులు సైతం వీచే అవకాశం ఉందన్నారు.