కొడంగల్కు బయలుదేరిన సీఎం
VKB: కొడంగల్లోని ఎన్కేపల్లి వద్ద అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రం ప్రారంభోత్సవానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కాగా, అక్షయపాత్ర ఆహార తయారీ కేంద్రంతో పాటు కొడంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రాంతీయ వృద్ధిని వేగవంతం చేసేందుకు కీలక ప్రాజెక్టులు చేపట్టారు.