జిల్లా కేంద్రంలో ఆరోగ్య చైతన్య ర్యాలీ
NGKL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించాయి. పాత కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కార్యక్రమంలో అధికారులు మధుసూదన్ రావు, శ్రీరామ్ ఆర్య పాల్గొన్నారు. పోషకాహారం, నిత్య వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.