కజ్జర్ల శివారులో చిరుత పాదముద్రలు

ADB: తలమడుగు మండలంలోని కజ్జర్ల, దేవాపూర్ శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. పంట పొలాలకు వెళ్లే రైతులకు చిరుత పాదముద్రలు కనిపించడంతో వారు భయాందోళనకు గురయ్యారు. అటవీశాఖ బీట్ ఆఫీసర్ కృష్ణను సంప్రదించగా అవి చిరుత పులి అడుగులుగా గుర్తించామని కజ్జర్ల, దేవాపూర్ అటవీ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటాయని, ఒకే ప్రాంతంలో నిలకడగా ఉండవని పేర్కొన్నారు.