రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
TPT: సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.అర్జీదారులు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించాలని, గత అర్జీల స్లిప్పులు తీసుకురావాలని సూచించారు. సమాచారం కోసం 1100 నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు.