ఎన్నికల పారదర్శకతకు ఓటరు జాబితా కీలకం: మంత్రి
సత్యసాయి: విజయవాడలోని ఐవీ ప్యాలెస్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రాష్ట్ర కార్యశాలలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ముఖ్య అతిథి శ్రీకాంత్ శర్మ, ఇతర నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎన్నికల పారదర్శకతకు ఖచ్చితమైన ఓటరు జాబితా కీలకమని మంత్రి పేర్కొన్నారు.