దివ్యాంగులకు ల్యాప్ట్యాప్ల పంపిణీ

NLR: దివ్యాంగులకు జాయింట్ కలెక్టర్ కార్తీక్ ల్యాప్ట్యాప్లను అందించారు. సోమవారం ఉదయం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 11 మంది దివ్యాంగులకు 11 ల్యాప్ట్యాప్లను అందించారు. ఒకొక్క ల్యాప్ట్యాప్ సుమారు 42 వేలు రూపాయలు కాగా మొత్తం 4. 62 లక్షల విలువైన వాటిని అందించారు.